జాతీయ కరాటే విజేతలను సన్మానించిన మాజీ సర్పంచ్ కొమ్మిడి శకుంతల ప్రభాకర్ రెడ్డి

అడ్డగూడూరు 19 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టుర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌళ్ళరామారం గ్రామాలో ఉన్నత పాఠశాలకు విద్యార్దినులు టీ సంకీర్తన,యు శ్రీవల్లి,టీ శైలజలు భువనగిరిలో స్టాండర్డ్ శిటొర్యు ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలను పాఠశాల ఆవరణలో శాలువలతో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ సర్పంచ్ కొమ్మిడి శకుంతల ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపీపీ దర్షణాల అంజయ్య,వారి తోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు,మాజీ వార్డు సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.