కలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలి
3 ఏండ్లు గడిచిన అమలుకు నోచుకోని జీవో అమలు
నవంబర్ 10న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
భువనగిరి 04 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– భువనగిరి జిల్లా కేంద్రములోని సంఘం కార్యాలయం ములో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షు కార్యదర్శులు సురూపంగా ప్రకాష్ వనం ఉపేందర్ మాట్లాడుతూ..వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలని నవంబర్ 10న జిల్లా కలెక్టర్ కార్యాలయల ముందు ధర్నా నిర్వహిస్తున్నామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ ప్రకటిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 34 ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు వికలాంగుల సంక్షేమ శాఖ మధ్య జిల్లాలో అందుబాటులో ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని 2022 డిసెంబర్ 2వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం జీవో ఇచ్చి 3 సంవత్సరాలు అవుతున్న అమలు కావడం లేదు.వికలాంగుల సంక్షేమం కోసం నిర్వహణ కోసం అసిస్టెంట్ డైరెక్టర్ ను జిల్లా స్థాయిలో తిరిగి నియమించాలని ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గతంలో వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా,శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని గతంలో విడుదల చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది.జిల్లా స్థాయిలో వికలాంగులకు సమర్థవంతమైన సేవలు అందించడానికి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వికలాంగుల సంక్షేమ శాఖను విభజించాలని గత ప్రభుత్వం నిర్ణయం చేసింది.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతున్న జీవో నెం 34అమలు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వేలాది ఉద్యోగాలను కొత్తగా నియమించడం జరిగింది. వారిలో నుండి వికలాంగుల సంక్షేమ శాఖను అవసరమైన ఉద్యోగులను నియమించడానికి అవకాశం ఉన్న ప్రభుత్వం ప్రయత్నం చేయలేదని వారు అన్నారు.వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని గత ప్రభుత్వం హయాంలో అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. పోరాటాలకు తలోగ్గి తెరాస ప్రభుత్వం జీవో విడుదల చేసింది. విడుదల అయిన జీవోను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుంది.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెం 34ను అమలు చేయాలని నవంబర్ 10 నాడు కలెక్టర్ కార్యాలయల ముందు జరిగే ధర్నాలను జయప్రదం చేయాలనీ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ కోరుతుంది.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు
సురుపంగ ప్రకాష్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లపల్లి స్వామి జిల్లా కోశాధికారి కొత్త లలిత తదితరులు పాల్గొన్నారు.