ఆరోగ్యమే మహాభాగ్యం"జయప్రద ఫౌండేషన్"నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం*జగ్గయ్యపేట

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి జగ్గయ్యపేట : ఆరోగ్యమే మహాభాగ్యం – *జయప్రద ఫౌండేషన్* నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతం
వత్సవాయి మండలం, మక్కపేట గ్రామం, జూలై 31: పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్న లక్ష్యంతో జయప్రద ఫౌండేషన్ చైర్మన్
శ్రీ *తొండపు దశరథ జనార్దన్* గారు రూపొందించిన “హాస్పిటల్ అన్ వీల్స్” సంచార వైద్య శిబిరం ఈరోజు మక్కపేట గ్రామంలో విజయవంతంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో వివిధ వైద్య విభాగాల నిపుణులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులు ఉచితంగా పంపిణీ చేయడం ద్వారా ప్రజల్లో వైద్య అవగాహన పెరిగేలా చేశారు.
ముఖ్యాంశాలు:
మొత్తం 500 మందికి పైగా ప్రజలు ఈ శిబిరం సేవలను పొందారు.
కంటి పరీక్షలు – 350 మందికి
దంత వైద్య పరీక్షలు – 48 మందికి
జనరల్ వైద్య సేవలు – 102 మందికి
ఇతర పరీక్షలలో:
షుగర్, బీపీ
రక్తపరీక్షలు
కొలెస్ట్రాల్
ఈసీజీ
హిమోగ్లోబిన్
వంటివి చక్కగా నిర్వహించారు.
ఈ శిబిరాన్ని విజయవంతం చేయడంలో గ్రామ సర్పంచ్ మల్లెల శివప్రసాద్, డాక్టర్ కామినేని భూపాల్ రావు, కోఆర్డినేటర్ కట్టా వెంకట నరసింహారావు మరియు కట్టా కోటయ్య ఫౌండేషన్ వాలంటీర్ల పాత్ర ప్రముఖంగా నిలిచింది.
*జయప్రద ఫౌండేషన్* చేపట్టిన ఈ ఆరోగ్య శిబిరం పట్ల ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరహా కార్యక్రమాలు మరిన్ని గ్రామాలలో జరగాలని ఆశిస్తున్నo