అయిజ మునిసిపల్ లో బీజేపీ ప్రచారం ఉదృతం అందరి చూపు బీజేపీ వైపు
బిజెపి జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి.
జోగులాంబ గద్వాల 6 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : అయిజ.*మునిసిపల్ *7వవార్డు బీజేపీ అభ్యర్థి కళ్యాణినరేష్ తరుపున ప్రచారం లో పాలుగోన్న రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మునిసిపల్ కి వచ్చే నిధులలో సింహ భాగం కేద్రం నుండి వచ్చేవి అని గతం లో ఉన్న BRS ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ కనీస నిధులు కూడా ఇవ్వడం లేదు అని వారు అన్నారు రెండు పార్టీలు రాష్ట్రను అప్పుల పాలు చేసి మొత్తం అవినీతి పాలన చేశారు అభివృద్ధి మాత్రం సూన్యం అని, కాబట్టి బీజేపీ అభ్యర్థులను గెలిపించండి అని వారు అన్నారు ఈ కార్యక్రమం లో జిల్లా ఉప అధ్యక్షులు సంఘాల సంజీవరెడ్డి పట్టణం అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి, రాజోలి మండల అధ్యక్షులు శశికుమార్, వడ్డేపల్లి నర్సింహా లక్ష్మణ్ గౌడ్, తెలుగు నర్సింహా, మేకల ఆంజినేయులు, తూముకుంట అంజి తదితరులు పాలుగోన్నారు...