శ్రీ బీచుపల్లి పుణ్య క్షేత్రంలో కృష్ణా నది సమీపాన వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానంలోతేదీ-10-11-2025,
సోమవారం పునర్వసు నక్షత్రం రోజున శ్రీ సీతా రాములవారి కళ్యాణం
జోగులాంబ గద్వాల 8 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి. మండలం,శ్రీ బీచుపల్లి పుణ్యక్షేత్రంలో కృష్ణా నది సమీపాన వెలసిన శ్రీ కోదండరామ స్వామి దేవస్థానం లో తేది -10-11-2025 సోమవారం రోజున,పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణము అంగరంగ వైభోగంగా జరుగును కళ్యాణమునకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి ఆనందించ గలరని, కోరుతున్నాము కళ్యాణం తదనంతరం దేవాలయమునకు విచ్చేసిన భక్తులకు మరియు కళ్యాణమునకు విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం గోపాల్ దీన్నే వాస్తవ్యులు మాణిక్యమ్మ సత్యం రామానుజ దాస దంపతులు నిర్వహిస్తున్నట్లు ఆలయ మేనేజర్ శ్రీ సురేంద్ర రాజు తెలియజేశారు_.