రోడ్డు వల్ల ప్రజల ఇబ్బందులు స్పందించిన పోలీసులు
జోగులాంబ గద్వాల 9 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల.:ఇటీవల కురిసిన వర్షాలకు కేటిదొడ్డి మండలం మైలగడ్డ స్టేజ్ సమీపంలోగల ర్యాలంపాడు కాలువ ముందు ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవతున్న నేపథ్యంలో గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్ ఆదేశానుసారం కేటిదొడ్డి ఎస్ఐ బి.శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులే స్వయంగా బాధ్యతతో మేము సైతం ప్రజాసేవలో ముందుంటామని మరో మారు నిరూపించుకుంటున్నారు. ట్రాక్టర్ల ద్వార మట్టి తెప్పించి గుంతలను పూడ్చి వేయడంతో వాహనాదారుల గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్ వారి సిబ్బంది పోలీసుల మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.