రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతు మృతి.

Jul 16, 2024 - 19:38
Jul 16, 2024 - 22:03
 0  183
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతు మృతి.

నాగారం జూలై 16:- రోడ్డు ప్రమాదంలో గాయాడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు.వివరాల ప్రకారం మంగళవారం తెల్లవారుజామున   నాగారం మండలం  ఫణిగిరి గ్రామ శివారులోని సూర్యాపేట జనగాం జాతీయ రహదారి 365 బి పై  తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్ లారీని నిర్లక్ష్యంగా నడిరోడ్డుపై సిగ్నల్ లేకుండా ఆపివేయగా అటు వైపు గా జాజిరెడ్డి గూడెం మండలం పర్సాయ పల్లి గ్రామానికి చెందిన బైరబోయిన  సైదులు  పాల వ్యాపారి, రోజువారి లాగానే తన వ్యానులో పాల వ్యాపారం కోసం వేకువ జామున వెళ్తుండగా  వెనుక వైపు నుంచి ఆగివున్న లారీ ని ఢీకొట్టగా సైదులు రెండు కాళ్ల విరిగి ఛాతీలో బలంగా గాయాలు అయ్యాయి.

విషయం తెలుసుకున్న ఎస్సై వెంకట్ రెడ్డి తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని   చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కి తరలించారు.అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం హైదార బాదు కామినేని హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.మృతుడికి  భార్య ముగ్గురు కుమార్తెలు ఉన్నారు .భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు. ఆయన వెంట సిబ్బంది ఎస్ఐ  వెంకట రాములు,  రైటర్ శేఖర్ ,గుండ గాని ఎల్లయ్య, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.