రామారం గ్రామంలో మృతుని కుటుంబానికి ఆర్దిక సహాయం 

Jul 8, 2024 - 19:57
Jul 8, 2024 - 20:18
 0  33
రామారం గ్రామంలో మృతుని కుటుంబానికి ఆర్దిక సహాయం 

అడ్డగూడూరు 08 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని చౌలరామారం గ్రామానికి చెందిన నాగిల్లి సురేష్ ఇటీవల మృతిచెందగా.. వారి కుటుంబ స్థితిగతులను నేపథ్యంలో సురేష్ మరణాన్ని చింతిస్తూ, ఆర్థిక సహాయాన్ని కోరుతూ గ్రామానికి సంబంధించిన గ్రూపులో పోస్ట్ చెయ్యగా మనసున్న మహారాజులు.స్పందించిన గ్రామస్తులు రూ.15,616 సేకరించి మృతుని సోమవారము రోజున కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయల భాస్కర్, సుందర్ రావు, గాలి ఏసుదాస్, తలపాక మహేష్, దర్శనాల మహేందర్, కమ్మంపాటి విష్ణు, మందుల మల్లేశ్, చిలుక ప్రభాకర్ తదితరులు పాల్గోన్నారు.