రఘునాధపాలెం మండలం మూల గూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పంపిణి""ఖమ్మం వ్యవసాయం మార్కెట్ చైర్మన్ యార గర్ల హనుమంతరావు

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం : రఘునాథపాలెం మండలం.....
మూలగూడెం గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇల్లు పట్టాలు పంపిణీ.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ గౌరవనీయులైన ఖమ్మం వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ యరగర్ల హనుమంతరావు గారు , ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖమ్మం శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి సిఫారసు మేరకు ములగూడెం గ్రామంలో 20 మందికి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఖమ్మం శాసనసభ్యులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు అలాగే గ్రామ నాయకులు గ్రామ పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడం జరిగింది.