ముఖ్యమంత్రి చేతుల మీదుగా మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభం
హుజూర్ నగర్, 06 మార్చి 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈ నెల రెండవ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కె నల్లమాధ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
బుధవారం హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోనీ రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఆయన పరిశీలించారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆదర్శ గృహ కాలనీ ప్రారంభానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్లు చెప్పారు.
అవసరమైతే అదనపు సమయం పనిచేసి అయినా వచ్చే ఒక వారంలో అన్ని పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
హుజూర్నగర్ సమీపంలోని రామస్వామి గుట్టలో 110 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాలనీ నిర్మించబడిందని,ఇందులో 2,160 కుటుంబాలకు సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించనున్నట్లు ఆయన తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అయితే 2014 లో రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురైందని ఆయన పేర్కొన్నారు.
2023లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణ శాఖా మంత్రిగా ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్కు ఎట్టకేలకు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే తుదిదశకు చేరుకుందన్నారు.
110 ఎకరాల విస్తీర్ణంలో రూ.125 కోట్ల వ్యయంతో (భూసేకరణ ఖర్చులు మినహా, ఎకరానికి రూ.1 కోట్లకు పైగా చెల్లించ బడింది) ఈ గృహ కాలనీ నిర్మించబడింది. మొత్తం 2,160 ఆధునిక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించి అంతే సంఖ్యలో కుటుంబాలకు వసతి కల్పించనున్నారు.
ఈ భూమిని ఎండోమెంట్స్ శాఖ నుంచి పూర్తి మార్కెట్ విలువ చెల్లించి, చట్టబద్ధమైన అన్ని అనుమతులతో ప్రభుత్వమే కొనుగోలు చేసిందని మంత్రి స్పష్టం చేశారు.
“మార్కెట్ విలువ చెల్లించి ఎండోమెంట్స్ శాఖ నుంచి భూమిని కొనుగోలు చేసి, అన్ని చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలనీ నిర్మాణం చేపట్టింది,” అని మంత్రి వివరించారు. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన ఈ ప్రాంతాన్ని సుసంపన్నమైన కాలనీగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లినట్లు ఆయన చెప్పారు.
ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు, అత్యంత పేద కుటుంబాలు, గ్రామీణ కూలీలు, రైస్ మిల్ కార్మికులు, హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు మరియు సమీప గ్రామాల నివాసితుల కోసం ఉద్దేశించబడింది.
లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరగాలని మంత్రి దృష్టి పెట్టారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో అధికారుల బృందానికి ఈ బాధ్యత అప్పగించినట్లు ఆయన తెలిపారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అర్హత లేని వారికి ఈ జాబితాలో పేరు ఉండకూడదని అని మంత్రి స్పష్టం చేశారు.
“మొదటి దశలో కేవలం 1,000 మంది లబ్ధిదారులను మాత్రమే ఖరారు చేస్తున్నామని అత్యంత అర్హులైన వారికి ప్రాధాన్యం ఇచ్చి,సూక్ష్మంగా పరిశీలించి ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
ప్రారంభోత్సవానికి సన్నాహాలు కొనసాగుతున్నాయని కాలనీ మరియు పరిసర ప్రాంతాలను సుందరీకారుస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్,
జిల్లా ఎస్పీ కె నరసింహ, హౌసింగ్ పీడీ సిద్ధార్థ, ఆర్టికల్చర్ పిడి నాగయ్య, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, జిల్లా డీసీసీ అధ్యక్షులు నరసయ్య, తహసిల్దార్ కవిత, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.