బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రామ్ రెడ్డిని గెలిపించుకుంటాం 

May 3, 2024 - 21:19
 0  43
బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రామ్ రెడ్డిని గెలిపించుకుంటాం 

గ్రంథాలయ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 

తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి అనంతుల ప్రశాంత్

తెలంగాణవార్త కొండపాక :- ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలని బిఆర్ఎస్ నాయకులు కోరారు. మెదక్ పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామారెడ్డికి మద్దతుగా ఆయన కుమారుడు సుప్రీత్ రెడ్డి తో పాటు బిఆర్ఎస్ నాయకులు కొండపాక మండలం సిరసనగండ్ల , గిరాయిపల్లి గ్రామాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బొద్దుల కనకయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే పూర్తిగా విఫలమైందన్నారు.

ఆరు గ్యారెంటీల అమలు చేయకపోవడంతో పాటు ప్రజలను మోసం చేసే మాటలు మాట్లాడుతుందన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి బిఆర్ఎస్ అమలు చేసిన పథకాలను వివరించి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి అనంతల ప్రశాంత్, బి ఆర్ ఎస్ నాయకులు నూనె కుమార్, రాగల దుర్గయ్య, గోనె శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి, ప్రశాంత్, మల్లేశం, రాజిరెడ్డి , సురేందర్ రెడ్డి, రాధా కిషన్ రెడ్డి దోమల ఎల్లం గురజాడ బాలాజీ గొట్టి ఐలయ్య జిర్రారాజు పెరుగు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333