పోలీస్ స్టేషన్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలి
డయల్ -100 కాల్స్ కు బ్లూ కోల్ట్స్ సిబ్బంది వెంటనే స్పందించాలి
అయిజ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికoగా సందర్శించి, తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ టి . శ్రీనివాస రావు, ఐపీఎస్.,.
జోగులాంబ గద్వాల 12 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఐజ పోలీస్ స్టేషన్ లోని పరిసరాలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే డయల్ - 100 కాల్స్ కు వెంటనే స్పందించాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐపీఎస్., అయిజ ఎస్సై పి. శ్రీనివాస రావుని ఆదేశించారు.
శుక్రవారం అయిజ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా సందర్శించి స్టేషన్ రికార్డ్స్ ను, స్టేషన్ పరిసరాలను మరియు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది నిర్వహిస్తున్న విధులను తనిఖీ చేశారు.
అందులో భాగంగా సిబ్బంది యొక్క ప్రాపర్ యూనిఫామ్ మెంటేనేన్స్ ను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, ఆవరణలో వాహనాల పార్కింగ్ ప్రదేశాలు. రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్ హెచ్ వో, మెన్ రెస్ట్ రూమ్ , లాక్ అప్ రూమ్ ను పరిశీలించారు. స్టేషన్ లో రోజు వారీగా నిర్వహిస్తున్న జనరల్ డైరీ, బీట్ డ్యూటీ బుక్స్, సుపీరియర్ ఆఫీసర్స్ విసిటింగ్ బుక్స్ తదితర రికార్డ్స్ ను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ ఏ విధులు నిర్వహిస్తున్నారో పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నుండి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ, ఎన్ని బిట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. విసృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని అన్నారు, డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం 24x7 గస్తీ నిర్వహించాలని , సిబ్బంది తమకు కేటాయించిన కాలనీలలో పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, తరచూ గ్రామాలను సందర్శించి సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పై , మూడ నమ్మకాలు, బాల్య వివాహాల పై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిఐ టాటా బాబు, ఎస్సై- 1 పి. శ్రీనివాసరావు, ఎస్సై- 2 తరుణ్ కుమార్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.