పోటీలో లేని పార్టీల తొలగింపు

Sep 25, 2025 - 19:28
 0  42
పోటీలో లేని పార్టీల తొలగింపు

జోగులాంబ గద్వాల జిల్లాలోని నిష్క్రియ రాజకీయ పార్టీలను రిజిస్టర్ పార్టీల జాబితా నుండి తొలగించాలని ప్రతిపాదిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.

జై మహాభారత్ పార్టీ గత 6 సంవత్సరాలుగా లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ మరియు ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 20ఎ ప్రకారం ఆ పార్టీ ఇక పనిచేయడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 లోని సెక్షన్ 29ఎ ఆర్టికల్ 324 ప్రకారం ఎన్నికల కమిషన్ తన అధికారాలను వినియోగించి ఆ పార్టీని రిజిస్టర్ పార్టీల జాబితా నుండి తొలగించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి తమ అభ్యంతరాలను ఈనెల 29వ తేదీ లోపు తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారికి సమర్పించాలని సూచించారు.అక్టోబర్ 8వ తేదీన  విచారణ జరగనుందని, ఆ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. తగిన సమాధానం ఇవ్వని పక్షంలో పార్టీకి ఎటువంటి అభ్యంతరాలు లేవని భావించి, ఎన్నికల కమిషన్ ఆ పార్టీని రిజిస్టర్ పార్టీల జాబితా నుండి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుందని కలెక్టర్ సంతోష్ స్పష్టం చేశారు.
.................................................................
జారీ చేయువారు:- డిపిఆర్ఓ/ జోగులాంబ గద్వాల జిల్లా.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333