నూతన ఎంపీఓ గా సుమలత
తిరుమలగిరి 14 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
నాగారం మండల ఎంపీడీవో కార్యాలయంలో నూతన ఎంపీవో గా జి. సుమలత గురువారం బాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని నెలలుగా ఈ పదవి ఖాళీగా ఉండగా, తాజాగా వెలువడిన గ్రూప్-2 ఫలితాల ద్వారా ఆమె ఎంపీవో గా నియామకం పొందారు. ఈ సందర్భంగా సుమలతకు ఎంపీడీవో బీమ్సింగ్ జాయినింగ్ ఆర్డర్ను అందజేశారు.