తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్.....
కేటీఆర్ కామెంట్స్
మూసీ ప్రాజెక్ట్ పేరుతో దేశంలోనే అతి పెద్ద కుంభకోణానికి తెరలేపారు.
దేశంలో వచ్చే ఎన్నికల కోసం ఈ ప్రాజెక్ట్ ను కాంగ్రెస్ రిజర్వ్ బ్యాంక్ లా వాడుకోవాలని చూస్తోంది.
నమామీ గంగే ప్రాజెక్టే రూ. 40 వేలు కోట్లు అయితే మూసీ ప్రాజెక్ట్ కోసం లక్షా 50 వేల కోట్లా?
ఇందులో మతలబు ఏంటి? ఇది కుంభకోణం కాక మరేమిటి?
కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యాలు ఏంటి? ప్రజలకు ఇచ్చిన హామీలను కాదని మీ విలాసాలకు లక్షా 50 వేల కోట్లా?
ప్రజల సొమ్ము మీ అయ్యా జాగీరా?
మూసీ బాధితుల పాలిట రేవంత్ రెడ్డి కాలయముడిగా మారాడు.
బాధితుల అక్రందనలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు వినబడటం లేదా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు తిట్టే తిట్లు గతంలో ఎప్పుడూ నేను వినలేదు.
ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటది. అవసరమైతే న్యాయం కోసం సుప్రీంను కూడా ఆశ్రయిస్తాం.