తూతూ మంత్రంగా పెద్ద వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు: అఖిల పక్ష కమిటీ

Jul 26, 2024 - 18:58
 0  2
తూతూ మంత్రంగా పెద్ద వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు: అఖిల పక్ష కమిటీ

????పెద్దవాగు బ్రిడ్జి నిర్మాణం పై అఖిలపక్ష కమిటీ సమావేశం

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ మునిసిపాలిటీ కేంద్రంలో గత  సంవత్సర కాలం గడిచిన  పెద్దవాగు బ్రిడ్జి పనులు పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు , ముఖ్యంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు  సరైన రోడ్డు మార్గం లేక  వాహనదారులకు, భారీ వాహనాలకు రవాణా సౌకర్యం లేక అక్కడేబురదలో ఆగిపోతున్నాయి. దీనిపై ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నారు, ఈ విషయమై శుక్రవారం పెద్దవాగు రహదారి  బ్రిడ్జి  పై   అఖిలపక్ష కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు, ఈ సమావేశంలో  వారు  మాట్లాడుతూ ప్రభుత్వం, ఉన్నంత అధికారులు ఈ పెద్ద వాగు రహదారి బ్రిడ్జి నిర్మాణ పనుల పట్ల ఎందుకు నిర్లక్ష్య వైఖరి పాటిస్తున్నారని, ప్రశ్నించారు బ్రిడ్జి పనులను త్వరలో పూర్తి చేయకపోతే  ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడి చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు  చేస్తామని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ప్రజలను దృష్టిలో ఉంచుకొని బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని  కోరారు. ఇట్టి కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ,

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333