డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11,545 (11.5 టన్నులు) కేజిల నిషేధిత గంజాయి దహనం

Mar 8, 2024 - 19:04
 0  92
డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11,545 (11.5 టన్నులు) కేజిల నిషేధిత గంజాయి దహనం
డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11,545 (11.5 టన్నులు) కేజిల నిషేధిత గంజాయి దహనం
డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11,545 (11.5 టన్నులు) కేజిల నిషేధిత గంజాయి దహనం
డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11,545 (11.5 టన్నులు) కేజిల నిషేధిత గంజాయి దహనం

28 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే నిషేధిత గంజాయిని దహనం చేయడం జరిగింది : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

జిల్లాలోని 06 పోలీస్ స్టేషన్లలో నమోదైన 33 కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన 11,545 కేజిల నిషేధిత గంజాయిని ఈ రోజు హేమచంద్రాపురం గ్రామ శివార్లలోని నిర్మానుష అటవీ ప్రాంతంలో పర్యావరణ కాలుష్య నియంత్రణా నిబంధనలను పాటిస్తూ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ 28 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది.జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రోహిత్ రాజు ఐపిఎస్ మరియు సభ్యులైన భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,డీసిఆర్బీ సిఐ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,ఆర్ఐ ఎంటిఓ,ఆర్ఐ వెల్ఫేర్ కృష్ణారావు, ఆరెఎస్సై జగన్ గార్ల ఆధ్వర్యంలో కోర్టు వారి అనుమతి తీసుకుని ఈ నిషేధిత గంజాయిని ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దశల వారీగా విభజించి దహనం చేయడం జరిగింది.ముందుగా జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ అయిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పోలీస్ స్టేషన్ల వారీగా కొన్ని భాగాలుగా విభజించిన గంజాయిని హెడ్ క్వార్టర్స్ నందు తూకం వేసి పరిశీలించారు.అనంతరం దహనం కొరకు సిద్ధం చేసిన మొత్తం గంజాయిని దగ్గర్లోని అటవీ ప్రాంతానికి తరలించి తగలబెట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ NDPS యాక్ట్ లోని నియమ నిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయిని ఈ రోజు దహనం చేయడం జరిగిందని తెలియజేసారు.కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయిని విక్రయిస్తూ పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారని,ఈ విధంగా ఆసాంఘీక కార్యాలపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా రహస్య బృందాల్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇకపై మత్తుకు బానిసలై గంజాయి లాంటి మత్తు పదార్ధాలను సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారితో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు,ట్రైనీ ఐపిఎస్ విక్రాంత్ సింగ్,డిఎస్పీలు రెహమాన్,సతీష్ కుమార్ మరియు డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, ఆర్ఐలు,సీఐలు, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11,545 (11.5 టన్నులు) కేజిల నిషేధిత గంజాయి దహనం

28 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే నిషేధిత గంజాయిని దహనం చేయడం జరిగింది : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్.

జిల్లాలోని 06 పోలీస్ స్టేషన్లలో నమోదైన 33 కేసుల్లో వివిధ సందర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసిన 11,545 కేజిల నిషేధిత గంజాయిని ఈ రోజు హేమచంద్రాపురం గ్రామ శివార్లలోని నిర్మానుష అటవీ ప్రాంతంలో పర్యావరణ కాలుష్య నియంత్రణా నిబంధనలను పాటిస్తూ జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ 28 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది.జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రోహిత్ రాజు ఐపిఎస్ మరియు సభ్యులైన భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,డీసిఆర్బీ సిఐ శ్రీనివాస్, ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,ఆర్ఐ ఎంటిఓ,ఆర్ఐ వెల్ఫేర్ కృష్ణారావు, ఆరెఎస్సై జగన్ గార్ల ఆధ్వర్యంలో కోర్టు వారి అనుమతి తీసుకుని ఈ నిషేధిత గంజాయిని ఈ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు దశల వారీగా విభజించి దహనం చేయడం జరిగింది.ముందుగా జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ అయిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పోలీస్ స్టేషన్ల వారీగా కొన్ని భాగాలుగా విభజించిన గంజాయిని హెడ్ క్వార్టర్స్ నందు తూకం వేసి పరిశీలించారు.అనంతరం దహనం కొరకు సిద్ధం చేసిన మొత్తం గంజాయిని దగ్గర్లోని అటవీ ప్రాంతానికి తరలించి తగలబెట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ NDPS యాక్ట్ లోని నియమ నిబంధనల ప్రకారం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న గంజాయిని ఈ రోజు దహనం చేయడం జరిగిందని తెలియజేసారు.కొందరు అక్రమార్జనలో భాగంగా గంజాయిని విక్రయిస్తూ పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారని,ఈ విధంగా ఆసాంఘీక కార్యాలపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం జిల్లా వ్యాప్తంగా రహస్య బృందాల్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఇకపై మత్తుకు బానిసలై గంజాయి లాంటి మత్తు పదార్ధాలను సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ గారితో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు,ట్రైనీ ఐపిఎస్ విక్రాంత్ సింగ్,డిఎస్పీలు రెహమాన్,సతీష్ కుమార్ మరియు డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు, ఆర్ఐలు,సీఐలు, సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333