డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

Oct 5, 2024 - 18:50
 0  11
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

జోగులాంబ గద్వాల 5 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల: శనివారం దౌదర్‌పల్లి (7వ వార్డు) సమీపంలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇండ్లను జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.             ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రకాల సదుపాయాలతో సకాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.   పెండింగ్ లో ఉన్న నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్లు, డ్రైనేజ్ వ్యవస్థ, సెప్టిక్ ట్యాంక్ , పరిసరాల సుందరీ కరణ వంటి మౌలిక వసతులు అన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  లక్ష్మీనారాయణ, ఎలక్ట్రిసిటీ డిఇ లక్ష్మీనాయక్, పంచాయతీరాజ్ ఈ.ఈ దామోదర్ రావు, పంచాయత్ రాజ్ డి.ఈ. లక్ష్మన్న, ఇరిగేషన్ ఈఈ గ్రిడ్ శ్రీధర్ రెడ్డి, గద్వాల తహసీల్దార్ మల్లికార్జున్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333