గద్వాల ప్రభుత్వ జనరల్ దావఖాన ను ఆకస్మిక తనిఖీ చేసిన. Prlscjcort గంట కవితా దేవి జిల్లా జడ్జి.
జోగులాంబ గద్వాల 1 జూన్ 2024 తెలంగాణ ప్రతినిధి:- గద్వాల. ప్రభుత్వ జనరల్ దావకానను శనివారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ఆకస్మిక తనిఖీ చేసి ఆస్పటల్ లో డాక్టర్లకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేయడం జరిగింది. డాక్టర్లు సంతకాలు పెట్టారు కానీ హాస్పటల్లో అందుబాటులో లేరని సూపర్డెంట్ పై prlscjcorat గంట కవితా దేవి వారిపై మండిపడ్డారు. కనీసం డాక్టర్లు సమయపాలన పాటించడం లేదని డాక్టర్లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అన్ని విషయాలను కూడా ఉన్నతాధికారులకు తెలియజేస్తానని ఆమె అన్నారు .కలెక్టర్ కు కూడా సమాచారం అందిస్తానని ఆమె పేర్కొన్నారు.
హాస్పటల్లో ఉన్న రోగులు కూడా డాక్టర్లు సరిగ్గా చూడడం లేదని రోగులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు. ఆమె రోగులకు ఎవరు కూడా గొడవలు పడవద్దండి సామరస్యంగా హాస్పిటల్ లో డాక్టర్లు తో చూయించుకొని మంచిగా ఉండాలని రోగులకు సూచించారు.