గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

Feb 14, 2024 - 21:32
Feb 14, 2024 - 21:34
 0  8
గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

మునగాల 14 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- బరాఖత్ గూడెం గ్రామంలో గడ్డి మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే మునగాల మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన మండవ నర్సయ్య గత కొంతకాలంగా

అనారోగ్యంతో బాధపడుతున్నాడు, అనారోగ్య సమస్యలు తట్టుకోలేక ఈనెల రెండవ తారీకున గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నాన్ని చేశాడు , ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అంజిరెడ్డి తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333