కాంగ్రెస్ గూటికి చేరిన మనపాడు మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి

May 9, 2024 - 21:24
 0  61

పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్

జోగులాంబ గద్వాల  9 మే 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- మానవపాడు. పదేళ్లుగా అధికార పార్టీలో కొనసాగిన మానవపాడు మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి తన అనుచరులైన రాముడు ,మద్దిలేటి ,సోమన్న ,బుడ్డన్న, గార్లతోపాటు దాదాపు 60 మంది కార్యకర్తలతో ఈరోజు శాంతినగర్ కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో సంపత్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఇదే క్రమంలో ఏ బూడిదపాడు గ్రామం నుండి జయరాముడు, రిటైర్డ్ వీఆర్ఏ జి రాముడు,  ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తలు సంపత్ కుమార్ చే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
పెద్దపోతులపాడు గ్రామం నుండి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు చేరారు.
పదేళ్ల టిఆర్ఎస్ అవినీతి పాలనలో మగ్గిపోయి విసుగు చెందిన నాయకులు నేడు రేవంత్ రెడ్డి  అధ్యక్షతన ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హర్షిస్తూ వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ.... అన్ని వర్గాలను కులాలను మతాలను కలుపుకుపోయే నిజాయితీ గల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ లో చేరిన ప్రతి వ్యక్తి కాంగ్రెస్ కుటుంబ సభ్యులేనని ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారెంటీలను అమలుపరిచామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333