ఐజ మరియు అలంపూర్ సబ్ -డివిజన్ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి.

Mar 15, 2024 - 18:46
 0  22
ఐజ మరియు అలంపూర్ సబ్ -డివిజన్ విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి.

జోగులాంబ గద్వాల 15 మార్చి 2020 4 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. తేదీ 16.03.2024 శనివారం నాడు 33KV శాంతినగర్ -1 ఫీడరు నుండి 33/11KV P.T. పాడు సబ్ -స్టేషన్కు వెళ్లే 33KV క్రాసింగ్ లైన్ పరిధిలో శివాలయం RDS కాలువ సమీపంలో "గ్రీన్ ఎక్ష్ప్రెస్ హైవే" వారి విద్యుత్ లైన్ మరమ్మత్తు పనులు చేపట్టుతున్నందున PT పాడు, ముండ్లదిన్నె, తుమ్మిళ్ల గ్రామాలకు విద్యుత్ సరఫరా మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:00 వరకు నిలుపుదల చేయటం జరుగుతుంది. అలాగే అదే ప్రాంతంలో ఉండే ఐజ మండలం, 33/11KV వెంకటాపురం సబ్ -స్టేషన్ యొక్క 11KV వెంకటాపూర్ ఫీడర్ పరిధిలోని మరియు 33/11KV శాంతినగర్ సబ్ -స్టేషన్ యొక్క 11KV కొంకల ఫీడరు పరిధిలోని కొన్ని వ్యవసాయ విద్యుత్ నియంత్రికలకు అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయటం జరుగుతుంది. కావున పైన తెల్పిన ఆయా గ్రామాల పరిధిలో మరియు 11KV ఫీడర్లలోని కొన్ని వ్యవసాయ విద్యుత్ నియంత్రికలకు మధ్యాహ్నం 3:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలియజేస్తున్నాం. కావున  విద్యుత్ వినియోగదారులు అందరూ సహకరించగలరు.
విద్యుత్ శాఖ, ఐజ మరియు అలంపూర్ సబ్ -డివిజన్, జోగులాంబ గద్వాల జిల్లా.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333