ఏపీలో కొండెక్కిన ఉల్లిధర
ఏపీలో నేడు సామాన్యులు ఉల్లిపాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. బహిరంగ మార్కెట్లో ఉల్లిధర రూ.70 దాటేసింది. దాంతో రోజురోజుకు ధర పెరుగుతుండడంతో సామాన్యుల నడ్డి విరుస్తోంది. మూడునెలల క్రితం రూ.25 పలికినధర నేడు మూడింతలు పెరిగింది. కొత్త పాయలు రూ.60, పాత పాయలు రూ.70కి విక్రయిస్తున్నారు. వరుసగా పండుగలు, శుభ కార్యాలు ఉండడం తో మరింత పెరిగే సూచనలు కనిపిస్తాయి.