ఎన్.పి.ఆర్.డి రాష్ట్ర సదస్సు ఈనెల 7న జయప్రదం చేయండి
యాదగిరిగుట్ట 01 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదగిరిగుట్ట 9వ వార్డు పాత గుట్టలో సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ హాజరై ఆయన మాట్లాడుతూ..ఫిబ్రవరి 9 10 11న జరిగే రాష్ట్ర సదస్సు సందర్భంగా ఈనెల 7న యాదగిరిగుట్ట లో జరిగే ఆహ్వాన సంఘం కమిటీ సమావేశాన్ని జయప్రదం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా 17 మండల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మన వికలాంగుల హక్కుల సమస్యలు పరిష్కారం కోసం ఈ సదస్సులో చర్చించడం జరుగుతుంది.ఈ ఆహ్వాన సంఘానికి ముఖ్య అదితి ప్రభుత్వం విప్పు ఎమ్మెల్యే బీర్లు ఐలయ్య హాజరు అవుతారు వికలాంగుల అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్.పి. ఆర్.డి జిల్లా నాయకులు పాల విజయ్ కుమార్ టౌన్ నాయకులు బానోత్ హరి కైలాసం నరసింహ ఓం ప్రకాష్ రాజు తదితరులు పాల్గొన్నారు.