ఉద్యమకారులకు కేసీఆర్ చేసింది ఏమి లేదు: కడియం శ్రీహరి.. 

Mar 30, 2024 - 22:54
 0  3
ఉద్యమకారులకు కేసీఆర్ చేసింది ఏమి లేదు: కడియం శ్రీహరి.. 

బీఆర్ఎస్ నేతలు అయోమ యంలో ఉన్నారని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైన ఆయన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్‌ ఆహ్వానం నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈమేరకు కుమార్తె కావ్యతో కలిసి మంత్రుల నివాస ప్రాంగణంలో తన అనుచరులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించారని, రెండ్రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్టు తెలిపారు. కడియం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ఆయన అనుచరులు తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ బలహీనపడిందన్న కడియం..ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారులకు కెసిఆర్ చేసింది ఏమి లేదని ఆయన విమర్శించారు. పార్టీ నేతల నుంచి సహకారం లభించలేదని, ఓడిపోయే పార్టీ నుంచి పోటీ వద్దని కావ్య అనుకు న్నట్టు చెప్పారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయమని పిలుపు వచ్చిందని, అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. ఆరూరి రమేష్‌ వద్దంటేనే కావ్యకు టికెట్‌ ఇచ్చారని చెప్పారు. తనను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదన్న ఆయన.. కావ్యను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333