* ఉండవెల్లి మండల కేంద్రంలో దారుణ హత్య

Jun 16, 2024 - 20:36
 0  36

జోగులాంబ గద్వాల 16 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఉండవెల్లి. మండల కేంద్రంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చోటు చేసుకుంది. సంబంధిత వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ కర్నూల్‌ జిల్లా కు చెందిన దేవేందర్ కు ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన మహేశ్వరి తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. గొడవల కారణంగా మహేశ్వరి తల్లి  దగ్గర పుట్టింట్లో ఉంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఉండవల్లిలో అత్తవారింటికి దేవేందర్ రాగా గొడవ జరిగి హత్యకు దారితీసినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి కేసు నమోదు చేసుకొని చేరుకొని క్లూస్ టీమ్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333