ఈత సరదా విషాదం కాకూడదు

Apr 23, 2025 - 20:12
 0  5
ఈత సరదా విషాదం కాకూడదు

తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల, చెరువులు,కాలువలు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్త లు తీసుకోవాలి.

ఈత వచ్చిన కుటుంభ సభ్యుల సంరక్షణ లోనే  చిన్నారులు బావులు,  చెరువులు, కాలువలు, కుంటల దగ్గరకు వెళ్లాలి

 ------- జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు .
 

వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో ఎంతో మంది పిల్లలు, యువకులు ఎండ  వేడి నుంచి సేద తీరటానికి, ఈత నేర్చుకోవడానికి   జలాశయాల వద్దకు వెళ్ళడం ద్వారా ప్రమాదాలకు గురయ్యే  అవకాశం వుందని కావున ఈత సరదా కుటుంబం లో విషాదం నింపకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని  జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు జిల్లా ప్రజలకు తెలియజేశారు.

 ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని, ఈత ను నేర్చుకునే చిన్నారులు, యువతి యువకులు   ఈత వచ్చిన వారి తల్లిదండ్రుల సమక్షంలో నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యoగా తల్లిదండ్రులు తమ పిల్లలను జలాశయాల వద్దకు చెరువుల వద్దకు కాలువల వద్దకు కుంటలు వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులు, మహిళలు బట్టలు ఉతికేoదికు చెరువుల దగ్గరకు కుడా ఈత వచ్చిన కుటుంబ సభ్యుల వెంట మాత్రమే వెళ్ళాలనీ  తెలిపారు. అలాగే పోలీస్ కళా బృందం ద్వార గ్రామాలలో ఈతకు వెళ్ళే చిన్నారులు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై కూడా అవగాహాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ముఖ్యంగా తల్లీ దండ్రులు వేసవి సెలవులలో తమ పిల్లల పై దృష్టి పెట్టాలని సూచించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333