ఇందిరమ్మ ఇండ్లు మంజూరు.
పంచాయతీ కార్యదర్శి ఏ రవి గౌడ్.
జోగులాంబ గద్వాల 15 జూన్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- మండలం చాగాపురం గ్రామానికి ఇప్పటివరకు 22 ఇందిరమ్మ గృహాలు మంజూరైనట్లు పంచాయతీ కార్యదర్శి రవి గౌడ్ తెలియజేశారు. మంజూరైన ఇందిరమ్మ గృహాలలో ఇద్దరు నిర్మాణం చేపట్టనందువలన వారి గృహాలను డిలీషన్ కొరకు కలెక్టర్ కి పంపినట్లు ఆయన తెలిపారు. 20మంది లబ్ధిదారుల గృహాలు బేస్మెంట్ లెవల్కు వరకు నిర్మాణం చేసుకున్నట్లు 6 లబ్ధిదారులు నిర్మాణం చేపట్టలేదని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల మంజూరి విషయంలో పురుషుల పేరు మీద గాని మహిళల పేరు మీద కాని దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తు ఇందిరమ్మ ఇల్లు కొరకు లబ్ధిదారుగా దరఖాస్తు చేశారో వారి పేరు మీద శాంక్షన్ ఇవ్వబడునని ఆయన తెలియజేశారు.