అలంపూర్ సబ్-డివిజన్, విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి.

May 22, 2024 - 17:56
 0  14
అలంపూర్ సబ్-డివిజన్, విద్యుత్ శాఖ వారి విజ్ఞప్తి.

జోగులాంబ గద్వాల 22 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి. నాణ్యమైన మరియు నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగింపు కొరకు తేదీ: 23.05.2024 గురువారం నాడు ఉదయం 07:00 గంటల నుంచి 10:00 గంటల వరకు 33KV శాంతినగర్-2 ఫీడరు  పరిధిలో ప్రతి వర్షాకాలపు ఋతుపవనాలకు ముందస్తుగా చేపట్టే మరమ్మత్తు పనుల్లో భాగంగా ఒరిగిన విద్యుత్ స్థంబాలను సరిచేయు పనులు మరియు మిడిల్ పోల్స్ ఎత్తే పనులు అలాగే లైన్లను తాకే చెట్లకొమ్మలను తొలగించే పనులు చేయటం జరుగుతుంది. 
కావున 33/11KV మానోపాడ్, కలుకుంట్ల సబ్-స్టేషన్ల పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన విద్యుత్ వినియోగదారులకు ఉదయం 07:00 నుంచి 10:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలియజేస్తున్నాం.
కావున  విద్యుత్  వినియోగదారులు అందరూ సహకరించగలని.
విద్యుత్ శాఖ,
అలంపూర్ సబ్-డివిజన్,
జోగులాంబ గద్వాల జిల్లా వారు కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333