76వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగరవేసిన రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు

76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన కొత్తపల్లి ఆంజనేయులు
జోగులంబ గద్వాల 26 జనవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయ సమీపంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కార్యాలయం నందు 76వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు ఆలియాస్ అంజి. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొత్తపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ.. జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులకు, రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఏజెంట్లకు 76వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.