సంక్షేమ పథకాల కు జాబితాల ఎంపిక పై అధికారులపై ఆగ్రహం
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- ఆత్మకూర్ ఎస్. ప్రభుత్వం చేపడుతున్న నాలుగు సంక్షేమ పథకాలపై మండల వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామసభలలో గ్రామాల్లో అధికారుల పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలం లో నీ నసీంపేట, కందగట్ల, బొప్పారం, ఖాసిగూడెం, కోటపాడు , మంగలి తండా, ఇస్తాలపురం గ్రామాల్లో అధికారులు 3వరోజు గురువారం గ్రామసభ లు నిర్వహించారు.కాగా గ్రామ సభలు పాల్గొన్న ప్రజలు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జాబితాలో అనర్హులకు అవకాశం కల్పించి అర్హుల జాబితాలో పేర్లు లేవని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కొన్ని గ్రామాలలో పింఛన్, మహిళ ఆత్మీయ భరోసా విశాలపై పై ఉపాధి పనులు చేయని వారి పేర్లు జాబితా లిస్టు లో చేర్చారని అధికారులపై మండి పడ్డారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ మండలాధికారులు తాసిల్దారు హరిచంద్ర ప్రసాద్ ఎంపీడీవో హసీమ్ ఎంఇఓ దారాసింగ్,వ్యవసాయ అధికారిని దివ్య సూపర్నెంట్ వెంకటాచారి, ఎంపీఓ రాజేష్ ,వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.