శ్రీరామ్ నగర్ లో మాజీ కౌన్సిలర్ జహీర్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
వచ్చిన భక్తులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమo
సూర్యాపేట 06 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీరామ్ నగర్, లో శ్రీ రామనవమి సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అందరికి ఉపయోగపడేటట్టు ఖాళీ స్థలంలో పెద్ద ఎత్తున షామియాలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో శ్రీరామనవమి వేడుకలకు వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దగ్గరుండి ముందుకు నడిపిస్తూ వచ్చిన భక్తులకు మజ్జిగ, పంపిణీ కార్యక్రమం ఏర్పాటుచేసి ఈ సందర్భంగా కౌన్సిలర్ జహీర్, మాట్లాడుతూ శ్రీరాంనగర్ ప్రజల ఉపయోగాలు వారికి ఎల్లప్పుడూ అన్ని పండగలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని
ప్రతి ఒక్కరు భక్తి భవాన్నీ పెంపొందించుకోవాలని అందరూ కలిసి అన్ని పండగలు జరుపుకోవాలని మాజీ మున్సిపల్ కౌన్సిలర్ షేక్ జహీర్, ఆదివారం శ్రీరామ నవమి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు బైరు శైలేందర్, పోల గాని బాలు గౌడ్, నాగుల వాసు,అర్చకులు, భక్తులు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.