వీర యోధుల పురిటి గడ్డ తుంగతుర్తి గడ్డ
తిరుమలగిరి 27 జూలై 2024 తెలంగాణ వార్త రిపోర్టర్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎంతోమంది వీర యోధులను అందించిన పురిటిగడ్డ తుంగతుర్తి అని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు గుర్తు చేశారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలో పద్మశాలి భవన్లో జరిగిన విస్తృత నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నిజం నిరంకుశ పాలనలో దొరలు, దోపిడీదారులు నిర్బంధ వసుళ్ళకు వ్యతిరేకంగా భూమి, భుక్తి, విముక్తి కావాలని వెట్టిచాకిరి అంతం కావాలని ఈ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ పోరాటంలో బొమ్మగాని ధర్మభిక్షం, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, దాయం రాజారెడ్డి, తొట్ల మన్సూర్, గుంటకండ్ల పిచ్చిరెడ్డి, మూల అనంతరెడ్డి, దొంగరి ముత్తులింగం లాంటివాళ్ళు విరోచిత పోరాటాలు మరవలేమన్నారు. నేటి పాలకవర్గాలు ఎన్నికలకు హామీలు పారదర్శకంగా అమలు చేయాలని గత ప్రభుత్వంలో ఇంటి స్థలాలు, రెండు పడకల గదులు ఇల్లు కట్టిస్తారని పేద ప్రజలు ఎదురు చూసి అలసిపోయారని అన్నారు.
ఈ ప్రభుత్వం గుర్తించి గృహ జ్యోతి పథకం అమలు చేయాలని అర్హులకు రేషన్ కార్డులు అందిస్తేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరగలదని ప్రభుత్వానికి సూచించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ విభజన హామీలకు నిధులు కేటాయించకపోవడం రాష్ట్రంలో బిజెపి ఎంపీలు కేంద్ర మంత్రి పదవుల్లో ఉండి కూడా నిధులు తేవకపోవడం వారి చేతకానితనానికి అద్దం పడుతుందన్నారు. తక్షణమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్లంల యాదగిరి సిపిఐ జిల్లా సమితి సభ్యులు బూర వెంకటేశ్వర్లు ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గుగులోతు రాజారం లు మాట్లాడారు సిపిఐ మండల నాయకులు కోట రామస్వామి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో సిపిఐ మండల కన్వీనర్ పాల్వాయి పున్నయ్య గిరిజన సమైక్య నాయకులు ప్రతాప్ సిపిఐ నాయకులు బానోత్ సతీష్ రవీందర్ రోశయ్య సత్యనారాయణ దేవేందర్ శ్రీనివాస్ గిరి రాజు తదితరులు పాల్గొన్నారు