బేతెస్థ మినిస్ట్రీస్ 18 వ వార్షికోత్సవం ఖాసీంపేట
జ్యోతిర్మయుడు అద్భుత స్తుతి గీతాలు పాటల పుస్తకం ఆవిష్కరణ
*వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా*
* పాస్టర్ రాజేష్ లివింగ్ హోప్ చర్చ్ హైదరాబాద్
* పాస్టర్ సిహెచ్. శ్యామ్ ప్రసాద్ సువార్త చర్చ్ ఆలమూరు
ఆదివారం 20 జులై : ఈ రోజు స్థానిక ఖాసీంపేట 4వ వార్డు సూర్యాపేట నందు బేతెస్థ మినిస్ట్రీస్ 18 వ వార్షికోత్సవం బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులు పాస్టర్ రాజేష్ లివింగ్ హోప్ చర్చ్ హైదరాబాద్ పాల్గొని దేవుని వాక్యాన్ని బోదించారు అనంతరం పాస్టర్ సిహెచ్ శ్యామ్ ప్రసాద్ సువార్త చర్చ్ కో ఆర్డినేటర్ ఆంధ్ర & తెలంగాణ మరియు బిషప్ యం పి హెచ్ యస్ మోజెస్ బేతెస్థ మినిస్ట్రీస్ జ్యోతిర్మయుడు అద్భుత స్తుతి గీతాలు పాటల బుక్ ప్రతిష్ట చేసి ప్రారభించారు. అనంతరం వెయ్యి మంది భక్తులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా మాట్లాడుతూ ఎన్నో శ్రమల మధ్యలో అన్నో అద్భుతాలు చేసి ఈ 18 సంవత్సరాలు కాపాడిన యేసు క్రీస్తూ దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియపర్చూచున్నాము అనీ అన్నారు.ఈ కార్యక్రమం లో చార్లెట్ హోం వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు, సూర్యాపేట నియోజకవర్గం అధ్యక్షులు రెవ. జలగం జేమ్స్,పాస్టర్ గుగులోత్ బాలాజీ నాయక్, రెవ. ఏర్పుల క్రిస్టోఫర్,పాస్టర్ యం రూబెన్పాస్టర్ కొండేటి లాజర్,పాస్టర్ జీడీ సుందర్,పాస్టర్ వరికుప్పల మత్తయి, రెవ. బొక్క ఏలీయా రాజు, రెవ. డి. జాన్ ప్రకాష్,యడవెల్లి బిక్షం,యేసుపాదం, తీతు, పేతురు, యాకోబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు