ప్రముఖ న్యాయవాది జటంగి కుటుంబాన్ని పరామర్శించిన యాదవ సంఘం నాయకులు

50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు
సూర్యాపేట, 04-03-2025 తెలంగాణవార్త విలేఖరి:- చివ్వెంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ మాజీ సర్పంచ్ ప్రముఖ న్యాయవాది జటంగి వెంకటేశ్వర్లు స్వర్గస్తులైనందున వారి కుటుంబాన్ని పరామర్శించడానికి శ్రీకృష్ణ ట్రస్ట్ చైర్మన్ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ గారి ఆధ్వర్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఎల్లవేళలా తోడుగా ఉంటామని వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని తెలియజేస్తూ వారికి కుటుంబానికి ఆర్థిక సాయంగా 50 వేల రూపాయలు అందించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో గొల్లగట్టు చైర్మన్ పోలేబోయిన నరసయ్య యాదవ్ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మర్యాద సైదులు యాదవ్ మాజీ జెడ్పిటిసి సుంకరబోయిన శ్రీనివాస్ యాదవ్ మాజీ సర్పంచ్ గొట్టేటి సైదులు యాదవ్ బడుగుల శ్రీనివాస్ యాదవ్ తూము వెంకన్న వారి కుటుంబ సభ్యులు జట్టంగి శ్రీనాథ్ యాదవ్ వీరబోయన ఉపేందర్ వీరబోయిన సైదులు పేర్ల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు