ప్రభుత్వ పాఠశాలలో చదివి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన శివాజీ*

Jan 25, 2025 - 18:33
Jan 25, 2025 - 19:31
 0  158
ప్రభుత్వ పాఠశాలలో చదివి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన శివాజీ*

ప్రభుత్వ పాఠశాలలో చదివి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన శివాజీ

తెలంగాణ వార్త జనవరి 25: పెన్ పహాడ్ మండల పరిధిలోని పొట్లపహాడ్ గ్రామానికి చెందిన బంగారు శివాజీ తండ్రి సుధాకర చారి తల్లి రాధిక ఇటివల విడుదల అయిన టీ పీ బి ఓ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సియర్ ఫలితాలలో రాష్ట్రస్థాయి లో 11 వ ర్యాంక్,మరియు జోనల్ స్థాయిలో 3 వ ర్యాంక్ సాధించి టీపిబిఓ ఉద్యోగాన్ని సాధించాడు.. అలాగే నిన్న విడుదల అయిన ఏఈ ఫలితాల లో ఇరిగేషన్ ఏఈ గా సెలెక్ట్ అయ్యాడు.. ఇలా 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన బంగారు శివాజీ 1నుండి 7 వ తరగతి వరకు పొట్లపహాడ్ ప్రాధమిక ఉన్నత పాఠశాలలో, 8 నుండి 10 వ తరగతి వరకు అన్నారం జిల్లా పరిషత్ హై స్కూల్ లో చదివాడు.. ఇలా గవర్నమెంట్ స్కూల్ లో చదివి 2014 సంవత్సరం పదవతరగతి లో 10/10 సాధించి , మేధా వాళ్ళు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో ఉత్తీర్ణుడు అయ్యి ఇంటర్ శ్రీచైతన్య కాలేజీ లో, తరువాత బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ వాసవి కాలేజీ లో చదివి తన స్వశక్తి తో కష్టపడి చదివి పోటీ పరీక్షలకి సిద్ధం అయ్యి ఇప్పుడు 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు.. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివి తల్లితండ్రుల కష్టాన్ని గుర్తించి ఇష్టంతో చదివి ఉన్నత ఉద్యోగం సాధించిన శివాజీకి తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలియజేశారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State