డోన్ వైపు మిల్క్ స్పెషల్ రైలుకు ఎదురుగా నిలబడి యువకుడు ఆత్మహత్య

Mar 9, 2024 - 00:31
Mar 9, 2024 - 00:33
 0  145
డోన్ వైపు మిల్క్ స్పెషల్ రైలుకు ఎదురుగా నిలబడి యువకుడు ఆత్మహత్య

జోగులాంబ గద్వాల 8 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఈరోజు తెల్లవారుజామున అందాజ 3 గంటల ప్రాంతంలో మేళ్లచెరువు గ్రామానికి చెందిన బోయ రవి, 23 సంవత్సరాలు గ్రామ సమీపంలోని రైలు పట్టాలు వద్దకు చేరుకుని కాచిగూడ నుంచి డోన్ వైపు వెళ్లే మిల్క్ స్పెషల్ రైలుకు ఎదురుగా నిలబడిఆత్మ హత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తుల కథనం ప్రకారం మృతుడు గత ఏడు సంవత్సరాల నుండి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని తెలిసినది. మృతుడు అవివాహితుడు. ఇతనికి తల్లి జ్యోతి తండ్రి కృష్ణ వివాహితులైన ఇద్దరు అక్కలు కలరు. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించడం జరిగిందని. G. రామకృష్ణ రైల్వే హెడ్ కానిస్టేబుల్ గద్వాల్ వారు తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333