జిల్లాలో వికలాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాలు పంపిణి చేయాలి
జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
భువనగిరి 19 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– ఏవో జగన్మోహన్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అనంతరం ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ గార్లు మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపిక అయిన వికలాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాలు వెంటనే పంపిణి చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి డిమాండ్ చేస్తుంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఉచితంగా సహాయ పరికరాలు పంపిణి చేసేందుకు లబ్ధిదారుల ఎంపిక కోసం 2025 జూన్ 6 నాడు టీవీసీసీ/సి1/119/2024 పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో పరికరాల కోసం వేలాది మంది వికలాంగులు దరఖాస్తులు చేసుకున్నారు.7920 మంది లబ్ధిదారులకు16 రకాల సహాయ పరికరాలు పంపిణి చేయడానికి జిల్లా స్థాయిలో లబ్ధిదారుల ఎంపిక జరిగి నెలలు గడుస్తుంది.కానీ నేటికీ పంపిణికి చేయలేదు.ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా పరికరాల పంపిణి కోసం 50 కోట్లు కేటాయించినది.సహాయ పరికరాల కోసం ఎంపిక అయిన లబ్ధిదారులు పరికరాల కోసం ఎదురుచూస్తున్నారు. తక్షణమే సహాయ పరికరాలను పంపిణి చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్ పి ఆర్ డి యాదాద్రి భువన జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేయడం చేస్తుంది.ఈ కార్య క్రమంలో ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ జిల్లా కోశాధికారి కొత్త లలిత బోనగిరి టౌన్ అధ్యక్షులు ఎషాల గోపి తదితరులు పాల్గొన్నారు.