ఇందిరా కాలనీలో ఇళ్లకు ఇంటి నెంబర్లు వెంటనే మంజూరు చేయాలి
సిపిఎం మండల కార్యదర్శి మధుసూదన్

మరిపెడ 26 జూలై 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– మహబూబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మున్సిపాలిటీ పరిధిలో మరిపెడ బంగ్లా శాఖ కార్యదర్శి కామ్రేడ్ సోమన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఇందిరా కాలనీ,పూల సెంటర్, మైనార్టీ కాలనీళ్లలో ఉన్న ఇళ్లకు ఇంటి నెంబర్లు మంజూరు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అదేవిధంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులూ ప్రబలకుండ ప్రభుత్వ యంత్రాంగం అధికారులు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోమల మందులు వెంటనే పిచికారి చేయాలని తెలియజేశారు.ఈ గ్రామశాఖ సమావేశంలో పార్టీ ఆర్గనైజర్ బాణాల రాజన్న,ఐద్వా మండల కార్యదర్శి దొంతూ మమత తాటికొండ అనంత చారి, చిదుముల శ్రీను అక్కినపల్లి రావాలి బాణాల రాజక్క,ఆల్వా ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.