అమ్మ ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ
అడ్డగూడూరు 28 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని మంగమ్మ గ్రామంలో సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం రోజు అమ్మ ఆదర్శ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి 80 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ చేతుల మీదుగా అందించారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ ఫౌండేషన్ చైర్మన్ ఎర్రోళ్ల సురేష్,పేరెంట్స్ చిప్పలపల్లి పరుశరాములు, ముక్కాముల శంకర్, పనస మహేష్,గుంటికాడి శంకర్,శ్రీశైలం,పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.