హైదరాబాద్లో దోశ, పూరి, వడ బంద్
-- ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కారణంగా గ్యాస్ కొరత
-- దీంతో తాత్కాలికంగా మూసివేత దిశగా హోటళ్లు, హాస్టళ్లు, మెస్లు
మెనూను కుదించి, ధరలు పెంచిన మరికొన్ని హోటళ్లు
వండేందుకు ఎక్కువ నూనె తీసుకునే, ఎక్కువ సమయం తీసుకునే టీ, కాఫీ, చపాతీ, దోశ, పూరిలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన హైదరాబాద్ ఐటీ కారిడార్ హోటళ్ల అసోసియేషన్
ఎక్కువ సేపు వండే వంటలను తగ్గించి అన్నం, సాంబార్, పప్పు, రసంలనే వడ్డిస్తున్న హైదరాబాద్లోని పీజీ హాస్టళ్లు, మెస్లు
రెండు, మూడు రోజులైతే వీటిని పూర్తిగా నిలిపివేసి, హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయడం తప్పదని తెలిపిన నిర్వాహకులు
రవాణా ఛార్జీలు పెరగడంతో దోశ, పూరి, వడలపై కనీసం రూ.15.. ఇడ్లీ, ఉప్మా లాంటి వాటిపై కనీసం రూ.10 వరకు పెంచిన పెద్ద హోటళ్లు