వాటర్‌ ట్యాంక్‌లో శవం, అదే నీళ్లను పదిరోజులుగా తాగుతున్న జనం

Jun 3, 2024 - 20:18
 0  7
వాటర్‌ ట్యాంక్‌లో శవం, అదే నీళ్లను పదిరోజులుగా తాగుతున్న జనం

నల్గొండ జిల్లా:జూన్ 03. నాగార్జునసాగర్ ఉదంతం మరువకముందే నల్లగొండ లో మరో ఘోరం చోటు చేసుకుంది. 

నల్లగొండ మున్సిపాలిటీ లోని 28వార్డు, హనుమాన్ నగర్ కు చెందిన ఆవుల వంశీకృష్ణ యాదవ్ (26) గత నెల 24వ తేదీ నుండి కనిపించకుండా పోయాడు  

అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెతకడం ప్రారంభించారు. ఈరోజు ఉదయం పట్టణం లో 12 వ వార్డులో గల హిందూపూర్ వాటర్ ట్యాంకులో వంశీకృష్ణ యాదవ్ శివమై కనిపించాడు.

అను మానాప్పద స్థితిలో మృతదేహం లభించడం తో స్థానికంగా కలకలం రేపింది. వాటర్ ట్యాంకులో వాటర్ చెక్ చేయగా అందులో డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. 

వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు. మున్సిపాలి టీ  సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పది రోజులుగా అ వార్డు ప్రజలు ఆ నీటిని తాగే పరిస్థితి ఏర్పడింది...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333