రాజ్యాంగ హక్కులు – కర్తవ్యాల జాగృతికి గద్వాల్ పోలీసులు ముందడుగు

Nov 26, 2025 - 18:37
Nov 26, 2025 - 19:09
 0  13

జోగులాంబ గద్వాల 26 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల నవంబర్ 26, రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని జోగుళాంబ గద్వాల్ జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు  పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ద్వారా అంగీకరించబడింది. ఈ రాజ్యాంగం 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. రాజ్యాంగ దినోత్సవం ద్వారా ప్రజలకు రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, బాధ్యతలు, కర్తవ్యాలపై అవగాహన కల్పించడం లక్ష్యం. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్  కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

 కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.శంకర్  పోలీసు సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో  ఎస్పీ అదనపు ఎస్పీ లతో పాటు, ఆర్ఐలు వెంకటేష్, ఆరిఫ్, సి.సి.ఎస్. సి.ఐ. రవి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, ఎస్సై రామకృష్ణ, ఐటి సెల్ ఎస్సై సుకూర్, డి.పి.ఓ. సిబ్బంది మరియు జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333