దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను అందజేసిన  ఎమ్మెల్యే 

Jul 19, 2024 - 20:18
Jul 19, 2024 - 20:20
 0  16
దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను అందజేసిన  ఎమ్మెల్యే 

జోగులాంబ గద్వాల 20 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల:- జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం గద్వాల ఎమ్మెల్యే  బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన దివ్యాంగులకు ఎలక్ట్రికల్ ట్రై సైకిళ్లను అందజేశారు.జోగులాంబ గద్వాల జిల్లా వివిధ మండలాలకు చెందిన  25మంది దివ్యంగులకు చెందిన ఎలక్ట్రికల్ బాటరీ ట్రై సైకిళ్లను హైదరాబాద్ కు చెందిన అలింకో సంస్థ గుర్తుంపు పొందిన సదరం సర్టిఫికెట్ 80 శాతం వైఖల్యం కలిగిన ఉన్న దివ్యాంగులకు ఉచితంగా ఇస్తుంది వీటిని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి స్వంతంగా ట్రాన్స్పోర్టు ఖర్చులు భరించి దివ్యంగులకు సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో దివ్యాంగ అధ్యక్షులు ఆరీఫ్, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State