గిరిజన బిడ్డకు దక్కిన గౌరవం కేతావత్ శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ

మాజీ మంత్రి సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి కి ధన్యవాదములు
మాడుగులపల్లి 10 మార్చ్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- శంకర్ నాయక్ చేసిన సేవలను గుర్తించి కాంగ్రెస్ హైకమాండ్ ఎంఎల్ఏ కోట కింద ఎమ్మెల్సీగా ఆదివారం ప్రకటించినందుకు కాంగ్రెస్ హైకమాండ్ కు మాజీ మంత్రి సీనియర్ నాయకులు కుందూరు జానా రెడ్డికి ధన్యవాదములు తెలియజేసిన మాడుగులపల్లి మండలం గజలాపురం గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు సింగం కార్తిక్ .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన బిడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రీతీ పాత్రుడు పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పార్టీ పటిష్టత కోసం పార్టీనే నమ్ముకొని సుదీర్ఘ కాలంగా ముందుండి పార్టీ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయా రాగ్యా నాయక్ తరువాత పార్టీ కోసం అంతగా పనిచేసిన నాయకుడు మన నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అని ఇప్పటికే జిల్లాకు రెండు పర్యాయాలు డిసిసి అధ్యక్షుడిగా పని చేసారని,నల్లగొండ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోయి జిల్లాలోనే అన్ని ఎమ్మెల్యే స్థానాలు భారీ మెజార్టీతో గెలిపించడానికి కష్టపడి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ధైర్యాన్ని ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో ముందుకు తీసుకువెళ్లిన కేతవత్ శంకర్ నాయక్ చేసిన సేవలను గుర్తించి కాంగ్రెస్ హైకమాండ్ ఎంఎల్ఏ కోట కింద ఎమ్మెల్సీగా ఆదివారం ప్రకటించినందుకు కాంగ్రెస్ హైకమాండ్ కు మాజీ మంత్రి సీనియర్ నాయకులు కుందూరు జానా రెడ్డికి ధన్యవాదములు తెలియజేశారు.