కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఫ్యాన్‌కు ఉరివేసుకున్న జేఈఈ అభ్యర్థి

కోటాలో-మరో-విద్యార్థి-ఆత్మహత్య-ఫ్యాన్కు-ఉరివేసుకున్న-జేఈఈ-అభ్యర్థి

Feb 14, 2024 - 14:37
Feb 15, 2024 - 00:35
 0  88
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఫ్యాన్‌కు ఉరివేసుకున్న జేఈఈ అభ్యర్థి

విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లోకి ఎక్కిన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఇది నాలుగో కేసు కాగా, గతేడాది 29 మంది ప్రాణాలు తీసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం ఉండడం లేదు.
12వ తరగతి చదువుతూనే జేఈఈకి శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి తాజగా తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ప్రతిరోజూ ఉదయాన్నే ఇంటికి ఫోన్ చేసే కుమారుడి నుంచి ఫోన్ కాల్ రాకపోవడంతో అనుమానించి, వార్డెన్‌కు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వార్డెన్ వెళ్లి చూస్తే విద్యార్థి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టానికి తరలించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333