కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిసిన బొడ్డు శ్రీధర్ రెడ్డి తల్లిదండ్రులు

Jul 6, 2024 - 20:44
 0  54
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిసిన బొడ్డు శ్రీధర్ రెడ్డి తల్లిదండ్రులు

06-07-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.

చిన్నంబావి మండల లక్ష్మీ పల్లి గ్రామ బొడ్డు శ్రీధర్ రెడ్డి తల్లిదండ్రులు  కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిని కలిసిన శ్రీధర్ రెడ్డి తల్లిదండ్రులు.

 చిన్నంబావి మండలం లక్ష్మిపల్లి గ్రామంలో మే 23వ తారీకు జరిగిన బొడ్డు శ్రీధర్ రెడ్డి హత్య చేసిన నిందితులు ఎవరు అనేది ఇప్పటి వరకు తేల్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని హత్యను చేదించడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈరోజు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసిన బొడ్డు శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు. చిన్నంబావి మండల మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, మాజీ జెడ్పిటిసి కేసిరెడ్డి వెంకటరమణమ్మా చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్ గోవింద శ్రీధర్ రెడ్డి, ముఖ్య నాయకులు కొల్లాపూర్ తాలూకా బిజెపి నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లెని సుధాకర్ రావు ఆధ్వర్యంలో బండి సంజయ్ కుమార్ నీ కలిసి తమ కొడుకును చంపి దాదాపు 50 రోజులు కావస్తున్న ఇప్పటివరకు నిందితులు అరెస్టు చేయకపోవడం దారుణమని తమ బాధను మంత్రి కి విన్నవించుకోవడం జరిగింది.వీరితోపాటు వనపర్తి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి,బిఆర్ఎస్ మాజీ సర్పంచులు మధు, రామస్వామి, శివ, సింగిల్ విండో డైరెక్టర్ డేగ శేఖర్ యాదవ్ఇం,ద్రసేనారెడ్డి, నియోజకవర్గ బిజెపి నాయకులు మేకల శ్రీనివాస్ యాదవ్,సందు రమేష్, జలాల శివుడు,బీమేష్, అన్వేష్ తదితరులు కలవడం జరిగింది. మీరు అధైర్యపడవద్దని దోషులను పట్టుకునే వరకు బిజెపి పార్టీ మీకు అండగా ఉంటుందని వారికి భరోసానివ్వడం జరిగింది లీగల్ సేల్ అడ్వకేట్లను మీ గ్రామానికి పంపిస్తామని చెప్పడం జరిగింది.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State