కలెక్టర్ దంపతులకు కూతురు.
జోగులాంబ గద్వాల 3 జూలై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రెండోసారి తండ్రి అయ్యారు. కలెక్టర్ దంపతులకు మొదటిసారి కుమారుడు జన్మించగా, గురువారం కూతురు పుట్టారు. ఈ శుభవార్తను పురస్కరించుకొని పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం శుక్రవారం కలెక్టర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ కుమార్తెను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.