ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ
తిరుమలగిరి 10 మార్చి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని నందాపురం గ్రామంలో పాడిపశువులకు మరియు దూడలకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని వార్డ్ కౌన్సిలర్ కన్నెబోయిన మల్లయ్య ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా 65 గేదెలకు దూడలకు మరియు 70 తెల్ల పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయడం జరిగినది .ఈ కార్యక్రమంలో రైతులు జక్కల లింగయ్య, చీమల మల్లయ్య ,మొగుళ్ళ మీనయ్య, కిష్టయ్య, నవీన్ లు మరియు పశు వైద్య సిబ్బంది ఇంచార్జ్ డాక్టర్ Drబత్తుల రవి, తాటిపాముల లైవ్ స్టాక్ అసిస్టెంట్(LSA) M స్వప్న, గోపాలమిత్ర సిహెచ్ సోమయ్య, కే రమేష్ లు పాల్గొనడం జరిగింది.