అర్హులకే అన్ని పథకాలు అందాలి మడిపల్లి విక్రమ్
సూర్యాపేట. 24 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- రాష్ట్రంలోని పేదల సంక్షేమమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని మడిపల్లి విక్రమ్ అన్నారు. గురువారం 34 వ వార్డులో ప్రజా పాలనలో పేదలకు న్యాయం జరుగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు లు తప్పకుండా వస్తాయా అని అన్నారు. ఎవరైతే ప్రజా పాలనలో అసలు పెట్టుకోలేని వారు ఇప్పుడు పెట్టుకుంటే అధికారులు వచ్చి ఎంక్వయిరీ చేసి అర్హులకు ప్రభుత్వ ఇచ్చే ప్రతి పథకం అందుతుందని తెలిపారు. ప్రజా పాలన ప్రజల వద్దకే పాలన కాబట్టి ఎవరు కూడా అధైర్యపడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో 34 వ వార్డు. కౌన్సిలర్ మడిపల్లి విక్రమ్, కాంగ్రెస్ పార్టీ 34 వార్డు ఇంచార్జ్ సాజీద్, వార్డు ఆఫీసర్, స్వేచ్ఛ, బిల్ కలెక్టర్ జానిమి యా, తాహెర్,, అమర్, సక్కు బాయ్, రఘు , రోజా, జమీర్, అశ్విని, తదితరులు పాల్గొన్నారు.